Monday, April 29, 2024

Breaking: ఆసిఫాబాద్ జిల్లాలో డయేరియా… ఇద్ద‌రు మృతి

డయేరియా విజృంభిస్తుండటంతో ఇద్దరు మృత్యువాత ప‌డిన ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలో డయేరియా ప్రబలుతోంది. కేరమెరి మండలం మురికిలంక తండాలో డయేరియా కేసులు నమోదయ్యాయి. తండాలో డయేరియా విజృంభిస్తుండటంతో ఇద్దరు మృత్యువాత పడడంతో పాటు పలువురు అస్వస్థతకు గురయ్యారు. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో సరైన పారిశుద్ధ్య చర్యలు లేకపోవడం, మురుగునీటి కాల్వలు ఉండటంతోనే డ‌యేరియా ప్రబలినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి డయేరియా వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత ప్ర‌జ‌లు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement