Friday, April 26, 2024

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు.. తొలి జాబితా విడుదల చేసిన బిజెపి

త్వరలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. కాగా ఈ ఎన్నికలో నిలిచే అభ్యర్థుల తొలి జాబితాను బిజెపి విడుదల చేసింది. మొత్తం 250 స్థానాలకు గాను 232 మంది అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో 126 మంది మహిళలు ఉన్నారు. 9 మంది మాజీ మేయర్లు, 52 మంది మాజీ కౌన్సిలర్లు, ముగ్గురు డాక్టర్లు, నలుగురు జిల్లా అధ్యక్షులు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో పాటు ఇద్దరు రాష్ట్ర పదాధికారులకు కూడా ఈసారి పోటీ చేసే అవకాశం కల్పించారు. కాగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఇప్పటికే 250 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఎంసీడీకి డిసెంబర్‌ 4 న ఎన్నికలు జరుగనున్నాయి. 7 న ఫలితాలు ప్రకటిస్తారు. 2017 ఎన్నికల్లో బీజేపీ 181 స్థానాల్లో విజయం సాధించగా.. ఆప్‌ 49, కాంగ్రెస్‌ 31 వార్డులను గెలుచుకున్నది. బీజేపీ జాబితాలో అన్ని కులాలు, సామాజికవర్గాలు, కిందిస్థాయి కార్యకర్తలకు అవకాశం కల్పించారు. 23 మంది పంజాబీలు, 21 మంది వైశ్యులు, 42 మంది బ్రాహ్మణులు, 34 మంది జాట్‌లు, 26 మంది పూర్వాంచలీలు, 22 మంది రాజపుత్రులు, 17 మంది గుర్జర్లు, 13 మంది జాతవులు, 9 మంది బాల్మీకులు, 9 మంది యాదవులు, ఒకరు సింధీ, ఇద్దరు ఉత్తరాఖండిలు, ఒక ముస్లిం ఉన్నారు. కాగా, 37 మంది సిక్కులకు ఈ దఫా పోటీకి అవకాశం కల్పించారు. వీరితో పాటు ఒకరు బలాయ్, ఇద్దరు భూమిహార్, ఇద్దరు ధనక్, ముగ్గురు ధోబి, ఒక్కరు కశ్యప్, ఒక్కరు కాయస్థ, ఇద్దరు కోలీ, ఒక్కరు కుష్వాహా, ఒక్కరు కమ్మరి, ఒక్కరు సైనీ, ముగ్గురు స్వర్ణకర్‌లకు కూడా టికెట్లిచ్చినట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement