Thursday, May 2, 2024

తమిళనాడులో పరువు హత్య… పెళ్లయిన నాలుగు రోజులకే..


నవ దంపతులు దారుణహత్యకు గురైన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వేరే కులం వ్యక్తిని ప్రేమించి పెళ్లిచేసుకుందనే అక్కసుతో యువతి కుటుంబసభ్యులు ఘాతుకానికి తెగబడ్డారు. పెళ్లైన నాలుగు రోజులకే నవ దంపతులను అత్యంత కిరాతకంగా నరికి చంపారు. పెళ్లిని అంగీకరిస్తున్నట్టు నమ్మించి యువతి సోదరుడు, ఆమె బంధువు ఇంటికి రప్పించి హత్య చేశారు. ఈ ఘటన తమిళనాడులోని కుంభకోణంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement