Thursday, May 2, 2024

బీహార్ పేలుడు ఘ‌ట‌న‌లో 14కు చేరిన మృతుల సంఖ్య

బీహార్ లోని భాగలాపూర్ ప్రాంతంలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ పేలుడులో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు 9మంది చ‌నిపోగా, ప‌లువురికి గాయాల‌య్యాయి. అయితే మృతుల సంఖ్య మ‌రింత పెరిగింది. ఇప్పటివరకూ 14 మంది చనిపోగా.. 10 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురున్నట్లు గుర్తించారు. క్షతగాత్రులను జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఈ పేలుడు ఘటనపై ఏటీఎస్ నేతృత్వంలో విచారణ జరుగుతోంది. ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ ఆరా తీశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement