Sunday, April 28, 2024

ఈ – కామ‌ర్స్ సంస్థ‌లో న‌టి స‌మంత పెట్టుబ‌డులు

ఒక ప‌క్క సినిమాలు..మ‌రోప‌క్క వ్యాపారాల‌తో బిజీగా ఉంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత‌. ఇప్పటికే సాఖి అనే క్లాత్‌ బ్రాండ్‌ స్టోర్‌ను సక్సెస్‌ఫుల్‌గా రన్‌ చేస్తోన్న సామ్‌ ఎడ్యుకేషన్‌, రెస్టారెంట్‌ బిజినెస్‌లలో కూడా రాణిస్తోంది. ఇదిలా ఉంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మరో కొత్త బిజినెస్‌లోకి అడుగు పెట్టిందీ అందాల తార. ఫ్లిప్ కార్ట్, అమెజాన్‌ తరహాలో సస్టైన్ కార్ట్ అనే ఈ- కామర్స్ సంస్థలో పెట్టుబడులు పెట్టింది. కాగా దీనిని సామ్ స్నేహితురాలు శిల్పా రెడ్డి నిర్వహిస్తోంది. ఇందులో అన్ని రకాల ఉత్పత్తులను సహజమైన పద్ధతుల్లో తయారుచేస్తారు. అనంతరం వాటిని దేశ వ్యాప్తంగా డెలివరీ చేస్తుంటారు. కాగా సస్టైన్‌ కార్ట్‌ లో ఇన్వెస్ట్‌ చేసిన సమంత దానికి సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. ‘సస్టైన్ కార్ట్‌లో భాగస్వామి అయినందుకు చాలా సంతోషంగా ఉంది. దేశంలో నేచర్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్‌లపై ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి సంస్థలో ఇన్వెస్టర్‌గా చేరినందుకు ఆనందంగా ఉంద‌ని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement