Sunday, May 5, 2024

తెల్ల బంగారానికి గరిష్ట ధర – క్వింటా పత్తి రూ. 10,100

తెల్ల బంగారం గరిష్ఠ ధరలకు అమ్ముడు పోతుంది. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యాపారులు క్వింటాల్ పత్తికి 10,100 చెల్లించి కొనుగోలు చేశారు. రాఘవపూర్ కు చెందిన ఆకుల సదయ్య విక్రయించేందుకు తెచ్చిన పత్తి గరిష్ట ధరకు కొనుగోలు చేశారు.ఈ సందర్భంగా మార్కెట్ యార్డులో స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి డి. పృథ్విరాజ్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు జడల సురేందర్, ఖరీదుధారు మధుసూదన్ తోట్ల రైతులు, హమాలీలు, మార్కెట్ సిబ్బంది పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement