Saturday, May 4, 2024

మెగాస్టార్ చిరంజీవికి మ‌రోసారి క‌రోనా


రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. పేద‌, ధ‌నిక‌, సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నేత‌లు అనే తేడా లేకుండా అంద‌రికీ క‌రోనా వైర‌స్ సోకుతోంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా కరోనా సోకిన వారి జాబితాలో చేరిపోతున్న స్టార్స్ లిస్ట్ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇటీవ‌లే మహేష్ బాబు, కీర్తి సురేష్, మంచు లక్ష్మి, థమన్ వంటి సినిమా సెలెబ్రిటీలంతా కరోనా బారిన పడి కోలుకుంటున్నారు.
తాజాగా… మెగాస్టార్ చిరంజీవికి మరోసారి కరోనా సోకింది. గతంలో ఒకసారి కరోనా బారినపడిన చిరంజీవికి మరోసారి కరోనా పాజిటివ్ గా తేలింది. స్వల్ప లక్షణాలు కనపడటంతో చిరంజీవి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్ గా తేలిందని స్వయంగా ట్వీట్ చేశారు. చిరంజీవి ప్రస్తుతం హోం ఐసొలేషన్ లో ఉన్నారు. తనను వారం రోజుల నుంచి కలసిన వారంతా వైద్య పరీక్షలు చేయించుకోవాలని చిరంజీవి సూచించారు. ఆరోగ్యంగానే ఉన్నానని, అభిమానులు ఆందోళన పడాల్సిన పనిలేదని చిరంజీవి ట్వీట్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement