Thursday, May 2, 2024

కొత్త‌గా 4,510క‌రోనా కేసులు – 14మంది మృతి

నేడు ఇండియాలో కొత్త‌గా 4,510 కరోనా కేసులు నమోదవగా, మరో 14 మంది వైరస్‌కు బలయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,45,47,599కి పెరిగింది. ఇందులో 4,39,72,980 మంది కోలుకున్నారు. మరో 5,28,403 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోగా 46,516 కేసులు యాక్టివ్‌ ఉన్నాయి. కాగా, గత 24గంటల్లో 5640 మంది కరోనా నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.33 శాతంగా ఉందని చెప్పింది. మొత్తం కేసుల్లో 0.10 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.71 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 216.95 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement