Friday, May 3, 2024

దేశంలో క‌రోనా విజృంభ‌ణ‌.. అప్‌డేట్స్ ఇవిగో

దేశంలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంది. నిన్న 2,58,089 కొవిడ్ కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిలెన్‌లో తెలిపింది. అలాగే, నిన్న‌ 385 మంది చనిపోయిట్టు తెలిపింది. నిన్న క‌రోనా నుంచి 1,51,740 మంది కోలుకున్నారని పేర్కొంది.

ప్ర‌స్తుతం హాస్పిటళ్లు, హోం క్వారంటైన్ల‌లో 16,56,341 మందికి చికిత్స అందుతోందని వైద్యశాఖ వర్గాలు తెలిపాయి. డైలీ పాజిటివిటీ రేటు 119.65 శాతంగా ఉందని, ఒమిక్రాన్ కేసుల సంఖ్య‌ 8,209కి పెరిగినట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 70.37 కోట్ల క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు. నిన్న‌ 13,13,444 ప‌రీక్ష‌లు చేసిన‌ట్లు కేంద్రం వివ‌రించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement