Thursday, April 25, 2024

ధాన్యాన్ని కొనుగోలు చేయాల‌ని గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసిన కాంగ్రెస్ నేత‌లు

TPCC అధ్యక్షులు రేవంత్ రెడ్డి సూచన మేరకు మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలో కాంగ్రెస్ బృందం రాష్ట్ర‌ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ని కలిశారు. రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి, రైతులకు న్యాయం జరిగేలా చూడాలని, అదే విధంగా కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందచేశారు. ఈ కార్యక్రమంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి, క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంత్ రావు, TPCC సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వేం నరేందర్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు నందికంటి శ్రీధర్ ల‌తో పాటు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement