Tuesday, March 26, 2024

ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్… ఏంటంటే…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ ప్ర‌జ‌ల‌కు శుభ‌వార్త తెలిపింది. రానున్న పండుగ‌ల దృష్ట్యా ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. క్రిస్మస్, సంక్రాంతి పండగల నేప‌థ్యంలో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌కు గడువు ను పొడిగించింది. దూర ప్రాంతాలకు వెళ్లే అన్ని బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ గడువును పొడిగించింది. ప్రస్తుతం 30 రోజుల ముందు మాత్రమే ముందస్తు రిజర్వేషన్‌ చేసుకొనేందుకు అవకాశముండేది… అయితే ఈరోజు నుంచి ఆ గ‌డువును 60 రోజులకు పొడిగిస్తూ ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వెళ్లే బస్సుల్లో, రాష్ట్రంలోని పలు ప్రాంతాల మధ్య తిరిగే అన్ని దూరప్రాంత బస్సుల్లో ఈ విధానం అమల్లోకి వస్తుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. దీంతో ప్ర‌యాణికుల‌కు మేలు జ‌రుగుతుంద‌ని ఏపీఎస్ ఆర్టీసీ భావిస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement