Monday, May 20, 2024

Flash.. Flash: మునుగోడుపై కాంగ్రెస్‌ కసరత్తు.. రాంరెడ్డి దామోద‌ర్‌రెడ్డి ఖాయం!?

హైెదరాబాద్‌, ఆంధ్రప్రభ : మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిత్వంపై కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు చేస్తోంది. ప్రత్యర్థి పార్టీల ఎత్తులు, వ్యూహాలను గమనిస్తూ పైఎత్తులు వేయాలనే ఆలోచనతో టీపీసీసీసీ నాయకత్వం ఆలోచన చేస్తోంది. సిట్టింగ్‌ సీటును ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదనే పట్టుదలతో కాంగ్రెస్ లీడ‌ర్లున్నారు. దానికి తగ్గట్టుగానే టికెట్‌ ఆశిస్తున్న వారి బలం.. బలహీనతలను బేరీజు వేసుకుని, అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీకి దీటుగా అభ్యర్థి ఉండేలా హస్తం నేతలు ప్లాన్‌ చేస్తున్నారు.

ఇక‌.. సర్వే ఆధారంగానే టికెట్‌ కేటాయించాలనే యోచనలో ఉండ‌గా.. దీనికి కొంత‌మంది రాంరెడ్డి దామోద‌ర్‌రెడ్డిని ప్ర‌తిపాదించిన‌ట్టు తెలుస్తంఓది. పీసీసీ నుంచి వ‌చ్చిన ఈ ప్ర‌తిపాద‌న‌కు సీఎల్‌పీ కూడా ఓకే చెప్పిన‌ట్టు స‌మాచారం. అంతేకాకుండా సీనియ‌ర్ లీడ‌ర్ జానారెడ్డి, ఎంపీ, పీసీసీ మాజీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి కూడా స‌పోర్ట్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇదేక‌నుక ఫైన‌ల్ అయితే.. ఇత‌ర పార్టీల‌కు గ‌ట్టిపోటీ ఇస్తార‌న్న న‌మ్మ‌కం ఆ పార్టీ నేత‌ల్లో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement