Monday, April 29, 2024

కమ్యూనిస్టులు టీఆర్​ఎస్​కు అమ్ముడుపోయారు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్​

కమ్యూనిస్టు పార్టీలను ‘ఎర్ర గులాబీలు’గా అభివర్ణిస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ చిల్లర పెంకులకు ఆశపడి టీఆర్ఎస్ కు అమ్ముడు పోయారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని, ఆ పార్టీ నేతలే ఒకరికొకరు బహిరంగంగానే కొట్లాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఇవ్వాల (బుధవారం) మధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర పదాధికారులు, ముఖ్య నేతలతో బండి ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

పాలకుర్తి నియోజకవర్గంలోని కిష్టాగూడెం వద్దనున్న ప్రజా సంగ్రామ యాత్ర లంచ్ శిబిరం వద్ద జరిగిన ఈ సమావేశంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు లోపాయికారీ ఒప్పందంతో కలిసే పోటీ చేస్తున్నాయని ఆరోపించారు బీజేపీ నేత బండి సంజయ్​. మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య జరుగుతుందన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజల కోసం రాజీనామా చేశారని, అతనిని మళ్లీ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement