Friday, May 3, 2024

సీనియ‌ర్ ఎన్టీఆర్ త‌ర్వాత మ‌ళ్లీ అంత‌టి క్రేజ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కే – పృథ్వీరాజ్

సీనియ‌ర్ ఎన్టీఆర్ త‌ర్వాత మ‌ళ్లీ అంత‌టి క్రేజ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కే ఉంద‌ని క‌మెడియ‌న్ పృథ్వీరాజ్ అన్నారు. భీమ్లా నాయ‌క్ చిత్రంలో న‌టించ‌లేద‌న్న బాధ ఉంద‌న్నారు. అప్ప‌ట్లో తాను సీనియ‌ర్ ఎన్టీఆర్ నటించిన అడ‌వి రాముడు సినిమా చూశాన‌ని అన్నారు. త‌న‌ జీవితంలో ఆ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోతుంద‌ని చెప్పారు. అప్ప‌ట్లో ఆ సినిమా చూడ‌డానికి తాడేపల్లి గూడెంలోని విజయా టాకీస్‌కు వెళ్తే అక్క‌డ‌కు భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్‌ను నియంత్రించేందుకు పోలీసులు లాఠీచార్జ్‌ చేశారని గుర్తు చేసుకున్నారు. భీమ్లా నాయ‌క్‌’ సినిమా క్లైమాక్స్‌తో పాటు రానా-పవ‌న్ క‌ల్యాణ్ న‌టించిన సన్నివేశాలు చాలా బాగున్నాయ‌ని తెలిపారు. తాను కూడా ఓ ప్రేక్షకుడిలా ఈ సినిమాను బాగా ఎంజాయ్‌ చేశానని అన్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు దిష్టి తగలకూడదని కోరుకుంటున్నాన‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement