Friday, May 17, 2024

ర‌క్షాబంధ‌న్ కు .. మ‌హిళ‌ల‌కు సీఎం యోగి బ‌హుమ‌తి

ఈనెల 11న ర‌క్షాబంధ‌న్ సంద‌ర్భంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ మ‌హిళ‌ల‌కు గిఫ్ట్ ఇస్తున్నారు. రాష్ట్రంలోని మహిళలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ బహుమతిని ప్రకటించారు. రెండు రోజుల పాటు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించవచ్చని ప్రకటన చేశారు. ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి నుంచి 12వ తేదీ అర్ధరాత్రి వరకు ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు. ఆ రెండు రోజుల పాటు మహిళలు ఉచితంగా, సురక్షితంగా ప్రయాణించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని యూపీ ఆర్టీసీని ఆదేశించారు. ఈ మేరకు సీఎం యోగి కార్యాలయం ట్విట్టర్ ద్వారా తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement