Saturday, May 4, 2024

జేపీ నడ్డాను కలిసిన రాజగోపాల్ రెడ్డి

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. బీజేపీ జాతీయ నేత జేపీ నడ్డాను రాజగోపాల్ రెడ్డి కలిశారు. ఈసందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ… ఈనెల 21వతేదీన బీజేపీలో చేరుతున్నామన్నారు. 12మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి పోయినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారన్నారు. పార్టీ ప్రాధాన్యత ఇవ్వకపోయినా చాలా కష్టపడి పనిచేశానన్నారు. బీజేపీలో చేరాలనుకోవడం మోసం చేయడమా అని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement