Monday, April 29, 2024

Breaking: బలపరీక్షలో నెగ్గిన సీఎం నితీశ్ కుమార్

బిహార్ అసెంబ్లీలో సీఎం నితీశ్ కుమార్ బలపరీక్షలో నెగ్గారు. ఫ్లోర్ టెస్ట్ లో నితీశ్ కుమార్ విజయం సాధించారు. ఏకగ్రీవంగా నితీశ్ కుమార్ ప్రభుత్వం నెగ్గింది. బీజేపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఈసందర్భంగా సభలో నితీశ్ కుమార్ మాట్లాడుతూ… బీజేపీలో మంచివాళ్లకు చోటు లేదన్నారు. వాజ్ పేయి, అద్వానీలే నా మాట వినేవారన్నారు. ఇప్పటి బీజేపీ నేతలది పని తక్కువ… ప్రచారం ఎక్కువన్నారు. 2017లో తేజస్వి యాదవ్ పై ఆరోపణలు చేశారని.. ఇప్పటి వరకు ఎందుకు నిరూపించలేదని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement