Tuesday, May 7, 2024

Big Breaking | సీఎం కేసీఆర్ గొప్ప నిర్ణ‌యం.. అమ‌రుడు శ్రీ‌కాంతాచారి త‌ల్లికి ఎమ్మెల్సీగా చాన్స్‌!

తెలంగాణ అమ‌ర‌వీరుల అఖండ జ్యోతి ప్రారంభోత్స‌వ వేళ సీఎం కేసీఆర్ ఓ గొప్ప నిర్ణ‌యం తీసుకోబోతున్న‌ట్టు తెలుస్తోంది. న‌ల్గొండ జిల్లాకు చెందిన అమ‌రుడు శ్రీ‌కాంతాచారి త‌ల్లి శంక‌ర‌మ్మ‌కు ఎమ్మెల్సీగా ప్ర‌క‌టించేందుకు చ‌ర్య‌లు తీసుకున్న‌ట్టు స‌మాచారం అందుతోంది. ఇందులో భాగంగా శంక‌ర‌మ్మ‌కు ముంద‌స్తుగా ప్ర‌భుత్వ వేహిక‌ల్‌, పీఏ, గ‌న్‌మ‌న్‌ను కేటాయించిన‌ట్టు తెలుస్తోంది.

ఇక‌.. రేపు (గురువారం) సీఎం కేసీఆర్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కాసోజు శంకరమ్మను ప్రకటించే అవకాశం ఉంద‌ని అధికార వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. తెలంగాణ అమరవీరుడు కాసోజు శ్రీకాంతచారి ఆత్మబలిదానంతో అత‌ని మాతృమూర్తికి ఈ అరుదైన గౌర‌వం ద‌క్క‌నున్న‌ట్టు స‌మాచారం. తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం ఆవిష్కరణ సందర్భంగా శంకరమ్మకు ఆహ్వానం అందిన‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement