Thursday, May 16, 2024

KCR: స‌చివాల‌య నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించిన సీఎం

నూత‌న స‌చివాల‌య నిర్మాణ ప‌నుల‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ గురువారం మ‌ధ్యాహ్నం ప‌రిశీలించారు. స‌చివాల‌య నిర్మాణ ప‌నుల గురించి ఆర్ అండ్ బీ అధికారులు, ఇంజినీర్లు సీఎం కేసీఆర్‌కు వివ‌రించారు. ప‌నుల పురోగ‌తిని అధికారుల‌ను అడిగి సీఎం కేసీఆర్ తెలుసుకున్నారు. ఏడు అంత‌స్తుల స‌చివాల‌య నిర్మాణాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం త‌ల‌పెట్టిన సంగ‌తి తెలిసిందే.

ఇప్ప‌టి వ‌ర‌కు ఆరు అంత‌స్తుల స్లాబ్ ప‌నులు పూర్త‌య్యాయి. రాత్రింబ‌వ‌ళ్లు మూడు షిప్టుల్లో నిర్మాణ ప‌నులు కొన‌సాగుతున్నాయి. స‌చివాల‌య నిర్మాణ ప‌నుల‌ను షాపూర్ జీ పల్లోంజీ కంపెనీ చేప‌ట్టింది. సీఎం కేసీఆర్ వెంట‌ మంత్రులు ప్ర‌శాంత్ రెడ్డి, స‌బితా ఇంద్రారెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్‌తో పాటు ప‌లువురు అధికారులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement