ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఈనెల 31న బీహార్ పర్యటనకు వెళ్లనున్నారు. బుధవారం ఉదయం హైదరాబాద్ నుండి పాట్నాకు బయలుదేరి వెళ్లనున్నారు. గతంలో ప్రకటించిన మేరకు, గాల్వాన్ ఘర్షణల్లో అమరులైన ఐదుగురు బీహార్ కు చెందిన భారతీయ సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయనున్నారు. సైనిక కుటుంబాలతో పాటు.. ఇటీవలి సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో చనిపోయిన 12 మంది బీహార్ వలస కార్మికుల కుటుంబాలకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో కలిసి సీఎం కేసీఆర్ చెక్కులు పంపిణీ చేయనున్నారు. అనంతరం బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆహ్వానం మేరకు మధ్యాహ్నం లంచ్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement