Saturday, May 18, 2024

సీఎం కేసీఆర్ ,మంత్రి కేటీఆర్ – చిత్రపటాలకు పుష్కర స్నానం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో .. శాప్ మాజీ డైరెక్టర్ & తెరాస రాష్ట్ర నాయకులు రాజనాల శ్రీహరి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల చిత్రపటానికి ఎడ్లబండ్లతో ఊరేగింపుగా తీసుకవచ్చి త్రివేణి సంగమంలో పుష్కర స్నానం చేయించి అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ..12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ప్రాణహిత పుష్కరాలకు మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, తదితర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగ్గు ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి, అధికారులకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం ధర్మకర్త తొనుపునూరి వీరన్న, వరంగల్ తూర్పు నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు నాగవెల్లి ప్రవీణ్, అయ్యగారు రవి శాస్త్రి, కుమ్మరి రాజశేఖర్, గండ్రకోట రాంచందర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement