Wednesday, May 1, 2024

రేపు ఢిల్లీలో నుంచి బయలుదేరనున్న సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌ రావు.. హస్తినలో బిజీ బిజీగా గడుపుతున్నారు.. ఈ నెల 1వ తేదీన ఢిల్లీ వెళ్లిన ఆయన.. మరుసటి రోజు టీఆర్‌ఎస్‌ కార్యాలయానికి శంకుస్థాపనలో పాల్గొన్నారు.. ఇక, మరుసటి రోజు.. ప్రధాని మోడీని, ఆ తర్వాత అమిత్‌షాను.. నిన్న కేంద్రమంత్రులు నితిన్‌ గడ్కరీ, గజేంద్ర షెకావత్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలపై కేంద్రమంత్రులతో చర్చించారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఇవాళ కూడా సీఎం హస్తినలోనే ఉండనున్నారు. ఇప్పటికే ఏడు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన తెలంగాణ సీఎం.. నేడు మరికొందరు కేంద్ర మంత్రులను కలిసేందుకు.. అక్కడే ఉంటారని తెలుస్తోంది… ఇక, రేపు ఢిల్లీ నుంచి తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు సీఎం కేసీఆర్.

ఇది కూడా చదవండి: ఓవల్ టెస్టులో టీమిండియా సూపర్ విక్టరీ

Advertisement

తాజా వార్తలు

Advertisement