Sunday, April 28, 2024

KCR : మ‌హారాష్ట్ర‌ బ‌స్సు ప్రమాద ఘ‌ట‌న‌పై సీఎం కేసీఆర్ సంతాపం

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 25 మంది సజీవ దహనమయ్యారు. ఆ రాష్ట్రంలో బుల్దానాలోని సమృద్ధి మార్గ్ ఎక్స్​ప్రెస్​ హైవేపై ఇవాళ వేకువజామున 2 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. యావత్మాల్​ నుంచి పుణెకు 32 మంది వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఈ ఘటనలో 25 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. అయితే, మహారాష్ట్రలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం లో చిక్కుకుని బస్సు లో ప్రయాణిస్తున్న పలువురు మరణించడం, మరికొందరు తీవ్రంగా గాయపడడం పట్ల బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement