Tuesday, April 30, 2024

అమితాబ్ బ‌చ్చ‌న్ ‘షో’లో సోనూసూద్..

కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి13వ సీజ‌న్ ర‌న్ అవుతోంది. ఈ సీజ‌న్ కి హోస్ట్ గా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కాగా ఈ షో చివరి దశకు చేరుకుంది. క్లోజింగ్‌ సెర్మనీలో భాగంగా రియల్‌ హీరో సోనూ సూద్ ఈ షోలో సందడి చేశారు. గెస్ట్ గా ఆయన బిగ్‌బీ షోలో పాల్గొన్నారు. ఇందులో ప్రముఖ హిందీ యాంకర్‌ కపిల్‌ శర్మ కూడా పాల్గొనడం విశేషం. వీరిద్దరు అమితాబ్‌తో కలిసి సందడి చేయగా, ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. ఈ గురువారంతో ఈ సీజన్‌ని ముగించనున్నారట. అందులో భాగంగా గెస్ట్ గా సోనూసూద్ ని ఆహ్వానించినట్టు తెలుస్తుంది.

అయితే ఇందులో సోనూసూద్‌కి గిఫ్ట్ ఇచ్చాడు కపిల్‌ శర్మ. గివ్స్ పేరుతో ఓ టీ షర్ట్ ని బహుకరించారు. అదే సమయంలో ఇందులో అమితాబ్‌ బచ్చన్‌..సోనూ సూద్‌ సేవలని కొనియాడారు. కరోనా ఫస్ట్ వేవ్‌, కరోనా సెకండ్‌ వేవ్‌ టైమ్‌లో సోనూ సూద్‌ చేసిన సేవలను ప్రశంసించారు. అపరిమితమైన సేవా కార్యక్రమాలను ఆయన అభినందించారు. విశేషమైన సేవా కార్యక్రమాలతో జనం గుండెల్లో నిజమైన హీరోగా నిలిచిపోయారని బిగ్‌బీ అభినందించడం విశేషం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి.. https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement