Wednesday, May 8, 2024

Tirumala: శ్రీవారి దర్శించుకున్న సీజేఐ N.V రమణ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ NV రమణ కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. జస్టిస్ ఎన్వీ రమణకు మహాద్వారం వద్ద స్వాగతం పలికారు. నిన్న సాయంత్రమే తిరుమలకు చేరుకున్న ఎన్వీ రమణ.. పద్మావతి అతిథి గృహం వద్ద ఘనస్వాగతం లభించింది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి జస్టిస్ ఎన్వీ రమణకు శాలువా కప్పి సత్కరించారు.

జస్టిస్ ఎన్వీ రమణ రాక నేపథ్యంలో పద్మావతి అతిథి గృహంలో పంచగవ్య ఉత్పత్తుల ప్రదర్శన ఏర్పాటు చేశారు. వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ సౌజన్యంతో టీటీడీ డ్రై ఫ్లవర్ సాంకేతికతతో రూపొందించిన తిరుమల వెంకన్న ఫొటోలు, పేపర్ వెయిట్లు, కీచైన్లతో ప్రత్యేక స్టాల్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను ఎన్వీ రమణ తిలకించారు. మధ్యాహ్నం జస్టిస్ ఎన్వీ రమణ తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement