Monday, April 29, 2024

రేవంత్ పై పరువు నష్టం కేసు.. తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు

తన పరువుకు భంగం కల్గించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ వేసిన పరువునష్టం దావా కేసులో తీర్పును సిటీ సివిల్ కోర్టులో రిజర్వ్ చేసింది . మంగళవారం ఈ కేసుపై విచారణ జరిగింది. కేటీఆర్ తరుపు న్యాయవాదుల వాదనలు ముగిసాయి. పరువుకు భంగం కలిగేలా రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేసారని వారు వివరించారు. డ్రగ్స్‌తో కేటీఆర్‌కు ఎలాంటి సంబంధం లేకపోయినా ఉద్దేశపూర్వకంగా రేవంత్‌రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి కోటి రూపాయలు పరువు నష్టం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇలాంటి ఆరోపణలు మరోసారి చేయకుండా శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేసారు. దావాపై కాసేపట్లో తీర్పును సిటీ సివిల్‌ కోర్టు వెల్లడించనుంది. కాగా, మంత్రి కేటీఆర్ కి డ్రగ్స్ కేసులో సంబంధం ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి:  వాణిజ్య ఉత్సవంను ప్రారంభించిన సీఎం జగన్

Advertisement

తాజా వార్తలు

Advertisement