Saturday, May 4, 2024

ట్ర‌క్కు.. కారు ఢీ.. 10మంది దుర్మ‌ర‌ణం

ట్ర‌క్కు..కారు ఢీకొన్నాయి.ఈ ప్ర‌మాదంలో 10మంది దుర్మ‌ర‌ణం చెందారు. ఛత్తీస్ గఢ్ లోని ధమ్ తారీ జిల్లాలో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ రోడ్డు ప్రమాదంలో చిన్నారితో పాటు పలువురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు. జగత్రా సమీపంలోని కాంకేర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సోరం నుంచి మర్కటోలా వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది . గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం రాయ్ పూర్ కు తరలించాం. ట్రక్కు డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాం అని బలోద్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. ఈ దుర్ఘటనపై ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన బాలిక త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే పురూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ చేసి, విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement