Monday, April 29, 2024

కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో భారీ అగ్రిప్ర‌మాదం – రూ.10కోట్ల‌కు పైగా ఆస్తి న‌ష్టం

ఓ ర‌సాయ‌న ప‌రిశ్ర‌మ‌లో భారీ అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. మొద‌టిగా ఓ కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో చెల‌రేగిన మంట‌లు , ప‌క్క‌నే ఉన్న మ‌రో ప‌రిశ్ర‌మ‌కి వ్యాపించాయి. ఈ సంఘ‌ట‌న మేడ్చ‌ల్ జిల్లా కీస‌ర మండ‌లం రాంప‌ల్లిలో చోటు చేసుకుంది. కాగా ఈ మంటల్లో పరిశ్రమలోని పరికరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయంతో సిబ్బంది బయటకు పరుగులు తీశారు. వెంటనే పరిశ్రమ యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 అగ్నిమాపక యంత్రాలతో మంటలు ఆర్పారు. ఈ ప్రమాదంలో సిబ్బంది అప్రమత్తమవ్వడం వల్ల ప్రాణనష్టం తప్పిందని పరిశ్రమ యాజమాన్యం తెలిపింది. రూ.10 కోట్లకు పైగా ఆస్తినష్టం జరిగినట్లు పరిశ్రమ యజమాని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement