Tuesday, May 21, 2024

రాజ్యాంగంలో మార్పు అవసరం.. దానికి ఎందుకింత గాబరా.. బీజేపీపై భగ్గుమన్న మోత్కుపల్లి

సీఎం కేసీఆర్ ఏం అన్నాడని ప్రతిపక్షాలు బట్టలు చింపుకుంటున్నాయో అర్థం కావడం లేదని, రాజ్యాంగంలో కచ్చితంగా మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు మాజీ మంత్రి, టీఆర్ ఎస్ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు. ఇవ్వాల మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలను టచ్ చేశారు. దేశ ప్రజలకు క్షమాపణ చెప్పిన రోజే మోడీ రాజీనామా చేయాల్సి ఉందని మండిపడ్డారు.. రాష్ట్రాల హక్కులపై సీఎం కేసీఆర్ పోరాటం చేసే అవసరం ఎందుకు వచ్చిందో ఒక్కసారి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.

మోత్కుపల్లి నర్సింహులు మాటల్లోనే..

‘‘ఏపీ, తెలంగాణ విభజన హామీలు ఎటు పోయాయి.. కేంద్ర ప్రభుత్వం ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చలేదు.  బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎటు పోయింది.. కాజీపేట రైలు కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడికి పోయిందో ఈ బీజేపీ ప్రభుత్వం చెప్పాలి..  నేషనల్ లెవల్ లో ఎదుగుతున్న సీఎం కేసీఆర్ తొక్కేందేకే బీజేపీ కొత్త ఎత్తుగడలు వేస్తోంది. మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉంటే.. ఇవాళ నిధులన్ని మీరు పాలించే రాష్ట్రాలకి ఇస్తే పోరాటం చేయడం తప్పేంటి. తెలంగాణలో కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ ఇస్తే మీరు పాలించే రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదు. తెలంగాణలో దళిత బంధు ఇస్తున్న సీఎం కేసీఆర్ మీద విమర్శలు చేయడం అంటే.. మీరు ఎంత దుర్మార్గపు మనుషులో అర్థం అవుతోంది. దళితుల మీద మీకు ప్రేమ ఉంటే దేశవ్యాప్తంగా ఎందుకు దళిత బంధు ఇవ్వడం లేదో చెప్పాలి’’..

‘‘దళితలకు న్యాయం చేసే దమ్ము దైర్యం మీకు ఉందా.. కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకుంటే ఖబడ్దార్ మిస్టర్ బండి. నేను దళిత బంధు పోగ్రాంలో కూర్చుంటే ఎంతో సంతోషంగా ఉంది.. రేపటి బడ్జెట్ లో 20 వేల కోట్లు పెట్టబోతున్నారు సీఎం కేసీఆర్. దళితులను అవమాన పర్చే మీరు.. దళితలకు న్యాయం చేస్తారనడంలో నిజం లేదు. తెలంగాణలో ఆదర్శవంతంగా పాలన చేస్తుంటే ఓర్వలేక పోతున్నారు. ఈ బీజేపీ… కరుడుగట్టిన బూర్జువా పార్టీ .. ఒక్కరోజు కూడా మతం గురించి మాట్లాడని రోజు ఉందా.. దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్ ఆలోచనా విధానంపై చర్చిస్తుంటే ఓర్వలేక ఈ అనవసర ఆరోపణలు. అంబేద్కర్ ను అవమానించారని ఆందోళనలు చేస్తున్నారు’’..

‘‘ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా రాజ్యాంగంలో మార్పులు చేయాలని అన్నారు. వాజపేయి ప్రభుత్వం రాజ్యాంగం మార్పుకోసం కమిటీ వేసింది.. మరి అది మీ బీజేపీనే కదా.. మీరు బీజేపీలో ఉన్నప్పుడు ఇవ్వన్నీ తెలుసుకోకుండా ఎందుకు మాట్లాడుతున్నారు. విదేశాల్లోని నల్లధనం తెచ్చి ప్రతి పేదవాడికి అందిస్తా అని మోడీ అన్నాడు.. ఎంత మందికి ఇచ్చారు మిస్టర్ బండి సంజయ్.. ఈ విషయంలో కనీసం సిగ్గు ఉందా’’..

- Advertisement -

‘‘ఇప్పటికే 105 సార్లు రాజ్యాంగ సవరణలు చేశారు.  ఆనాడు అంబెద్కర్ కూడా చెప్పారు. అవసరమైతే రాజ్యాంగమే మార్చుకోవచ్చు అని. దళిత గిరిజన యువత ఎంతో ఆలోచన చేయాలి… అంబేద్కర్ గురించి సీఎం కేసీఆర్ ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు.. రాజ్యాంగంపై చర్చ జరగాలి అన్నారు. అణగారిన కులాల పట్ల ఇంకా వివక్ష ఉంది.. సీఎం కేసీఆర్ దళిత వ్యతిరేకి అంటున్నారు కదా.. మరి మద్యం షాప్ లు, మెడికల్ షాప్ లు, ఇతర పరిశ్రమల్లో కూడా దళితులకు రిజర్వేషన్లు కల్పించారు. మరి ఈ మాట మాట్లాడరేంది.. దళిత బంధు అందించడంతో హుజురాబాద్ లో ఇవాళ ఇంటింటా పండుగ చేసకుంటున్నారు..  సీఎం కేసీఆర్ మీద మాట్లాడే ఏ వ్యక్తి అయిన సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. జై భీం అనే పదం మాట్లాడనికి మీకు హక్కు లేదు.. ఆనాడు నీళ్ల కోసం పోతే కూడా అంటరాని వాళ్లుగా హేళన చేశారు. కానీ, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు ఇస్తున్న మహనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్.’’  అని చెప్పుకొచ్చారు మోత్కుపల్లి నర్సింహులు..

Advertisement

తాజా వార్తలు

Advertisement