Wednesday, May 15, 2024

Big Update | చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్​–3.. విజయవంతంగా దూసుకెళ్తున్న వ్యోమ నౌక!

చంద్రయాన్‌-3 ప్రయోగంలో మరో కీలక ఘట్టం పూర్తి అయ్యింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్‌-3 ఒక్కోదశను దాటుకుంటూ విజయవంతంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఐదు దశలను పూర్తిచేసుకున్న చంద్రయాన్‌ వ్యోమనౌక  ఆరో దశ అయిన చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ట్రాన్స్‌ లూనార్‌ కక్ష్యలోకి  ప్రవేశించినట్లు ఇస్రో వెల్లడించింది. భూమి చుట్టూ తన కక్ష్యలను పూర్తిచేసి చంద్రుని వైపుచంద్రయాన్​–3 వెళ్తోందని ఇస్రో ట్విట్టర్​లో వెల్లడించింది.

ఇక.. ఇస్రో టెలిమెట్రి, ట్రాకింగ్‌, కమాండ్‌ నెట్‌వర్క్‌ వద్ద పెరిజీ-ఫైరింగ్‌ విజయవంతంగా పూర్తయిందని, వ్యోమనౌకను ట్రాన్స్‌లూనార్‌ కక్ష్యలోకి ప్రవేశపెట్టామని శాస్త్రవేత్తలు తెలిపారు. తదుపరి గమ్యం చంద్రుడేనని, మరో ఐదు రోజుల్లో అంటే ఆగస్టు 5వ తేదీ నాటికి చంద్రుడి కక్ష్యకు చంద్రయాన్​–3 చేరుకుంటుందని తెలిపారు.

ట్రాన్స్‌ లూనార్‌ ఇంజెక్షన్‌ ప్రక్రియ తర్వాత వ్యోమనౌక భూ పరిభ్రమణాలు పూర్తిచేసుకుని చంద్రుని మార్గాన్ని అనుసరిస్తున్నదని ఇస్రో అధికారి తెలిపారు. కాగా, వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత దాని నుంచి ల్యాండర్‌ విడిపోవడం, చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ కావడం వంటి కీలక ఘట్టాలు ఉంటాయి.

ఈ ప్రక్రియ ఆగస్టు 23వ తేదీ నాటికి పూర్తికానుంది. ఇది విజయంతం అయితే అమెరికా, చైనా, రష్యా సరసన భారత్‌ చేరనుంది. చంద్రుడిపై దాగి ఉన్న రహస్యాలను ఛేదించే లక్ష్యంతో చంద్రయాన్‌-3 రాకెట్‌ను ఇస్రో జూలై 14వ తేదీన ప్రయోగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement