Sunday, May 5, 2024

Breaking : సాయితేజ కుటుంబాన్ని ఆదుకోండి .. ఏపీ సీఎస్ కి చంద్ర‌బాబు లేఖ

ఏపీ సీఎస్ కు టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు లేఖ రాశారు. సాయితేజ కుటుంబానికి రూ. కోటి ప‌రిహారం ఇవ్వాల‌ని తెలిపారు. కుటుంబంలో ఒక‌రికి ప్ర‌భుత్వ ఉద్యోగం క‌ల్పించాల‌న్నారు. ఈ మేర‌కు సాయితేజ కుటుంబాన్ని ఆదుకోవాల‌ని చంద్ర‌బాబు లేఖ రాశారు. ఆర్మీ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో సాయితేజ మ‌ర‌ణించాడు. ఆయ‌న మృత‌దేహం ఆయ‌న స్వ‌స్థ‌లానికి చేరుకోనుంది. కాగా ప్ర‌మాదంలో మరణించిన వారిలో 3 మృతదేహాలను మాత్రమే అధికారులు ఎవరు అనేది గుర్తించారు. మిగిలిన వారిని గుర్తించడానికి సవాల్ గా మారుతోంది.

దీంతో డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా.. సాయితేజ్ తల్లిదండ్రులు, కుమారుడి బ్లెడ్ సాంపిల్స్ ఆర్మీ డాక్టర్లు తీసుకున్నారు. పరీక్షలు పూర్తికాగానే సాయితేజ్ మృతదేహం చిత్తూరు జిల్లా ఎగువరేగడ గ్రామానికి తరలించనున్నారు. ప్రమాదంలో మరణించిన సాయితేజ్ 20 ఏళ్ల వయసులు సైన్యంలో చేరాడు. 29 ఏళ్లకే వీరమరణం పొందాడు. అటు, సాయితేజ్ తమ్ముడు మహేష్ బాబు కూడా సైన్యంలోనే పని చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement