Friday, April 26, 2024

Chandrababu: భ‌య‌పెట్టేందుకే వైసీపీ హ‌త్యాంకాండ.. టీడీపీ నేత హత్యపై చంద్రబాబు ఆగ్రహం

గుంటూరు జిల్లా మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం గుండ్ల‌పాడులో టిడిపి గ్రామ అధ్య‌క్షుడు తోట చంద్ర‌య్య హ‌త్య‌ను పార్టీ అధినేత‌ చంద్ర‌బాబు తీవ్రంగా ఖండించారు. చంద్ర‌య్య కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు చంద్రబాబు గుండ్ల‌పాడు వెళ్ల‌నున్నారు. వైసిపి అరాచ‌క పాల‌న‌లో ఇప్ప‌టికే రాష్ట్రంలో ప‌దుల సంఖ్య‌లో కార్య‌క‌ర్త‌ల ప్రాణాలు తీశారని చంద్రబాబు ఆరోపించారు. జ‌గ‌న్ రెడ్డి దారుణ పాల‌న‌పై తిర‌గ‌బ‌డుతున్న టిడిపి క్యాడ‌ర్ ను, ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెట్టేందుకే వైసిపి హ‌త్యాంకాండ సాగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ప‌ల్నాడులోనే ఇప్ప‌టికి ప‌దుల సంఖ్య‌లో రాజ‌కీయ హ‌త్య‌లు జ‌రిగాయని చెప్పారు.

స్థానిక ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీ కార్య‌క్ర‌మానికి వెళ్లిన టిడిపి నేత‌లు బోండా ఉమా, బుద్దా వెంక‌న్న‌ల‌పై హ‌త్యాయ‌త్నం చేశారని గుర్తు చేశారు. ఆనాడే పోలీసులు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుని ఉంటే వైసిపి బ‌రితెగింపుకు అడ్డుకట్ట ప‌డేదని అభిప్రాయడ్డారు. దాడులు చేసిన వారికి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టి త‌న విష సంస్కృతిని జ‌గ‌న్ చాటుకున్నారని విమర్శించారు. వైసిపి మూక చేతిలో హ‌త్య‌కు గుర‌యిన చంద్ర‌య్య కుటుంబానికి టిడిపి అండ‌గా ఉంటుందని చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement