Friday, May 10, 2024

Minister : అవినీతి, అసమర్ధతతకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్… కేటీఆర్

దేశంలో అవినీతికి, అసమర్ధతకు ఒకే ఒక్క కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అంటూ మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ పర్యటనలో రాహుల్ గాంధీ ఖమ్మంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ వరుస కౌంటర్లతో విరుచుకుపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒక్కటేనని బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు. మా పార్టీ బీ టీమ్ కాదు..కాంగ్రెస్, బీజేపీలను ఢీకొట్టే పార్టీ అంటూ ధీటుగా సమాధానమిచ్చారు. బీజేపీ బీఆర్ఎస్ బీటీమ్ అంటే బీజేపీ బంధువుల పార్టీ అంటూ రాహుల్ విమర్శలకు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. మాది బీజేపీ బంధువుల పార్టీ కాదు మీదే భారత రాబంధుల పార్టీ అంటూ ఘాటు సమాధానమిచ్చారు. ఏఐసీసీ అంటేనే అఖి భారత కరప్షన్ కమిటీ అంటూ ఎధ్దేవా చేశారు. స్కాములతో దేశాన్ని భ్రష్టు పట్టించారని ఆ స్కాములే త్రాచుపాములై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ను మింగేశాయని కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ కాదు కాంగ్రెస్ కు సి టీమ్ అంతకన్నా కాదు.. మా బీజేపీకి, కాంగ్రెస్ లను ఒంటిచేత్తో ఢీకొట్టే పార్టీ అంటూ సమాధానమిచ్చారు.

ఖమ్మంలో సభలో రాహుల్ గాంధీ ..తెలంగాణలో వృద్ధులు, వితంతువులకు రూ.4,000 పింఛను ప్రకటిస్తున్నా అని తెలిపారు. దీనిపై కూడా కేటీఆర్ కౌంటర్ ఇస్తూ.. కర్ణాటకలో అన్న భాగ్య హామీని గంగలో కలిపి అక్కడ 4వేల పెన్షన్ అంటే నమ్మేదెవరు అని ఎన్నికల్లో హామీ ఇచ్చిన రేషన్ ఇశ్వలేనోళ్లు…ఇక్కడికొచ్చి డిక్లరేషన్ అంటే విశ్వసించేదెవరు ? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటున్న కాంగ్రెస్ అర్థం పర్థంలేని విమర్శలు చేస్తోందంటూ విరుచుకుపడ్డారు. రూ. లక్ష కోట్లు ఖర్చుకాని కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతా? అని ప్రశ్నించారు. అర్థం పర్థం లేని ఆరోపణలు చేసి ప్రజాక్షేత్రంలో ఎన్నిసార్లు నవ్వులపాలు అవుతారు? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు కోరుతోంది నిర్మాణాత్మక ప్రతిపక్షం..ప్రాజెక్టు నిర్మాణ వ్యయం కూడా తెలియని ప్రతిపక్షం కాదు అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement