Thursday, May 2, 2024

Breaking: గంజాయి సప్లయ్​దారుకు 20 ఏళ్ల జైలు, లక్ష జరిమానా.. నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

గంజాయి రవాణా చేస్తున్న వారిపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే రెండేళ్ల క్రితం గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ వ్యక్తి కేసులో ఫైనల్​ జడ్జిమెంట్​ ఇవ్వాల వచ్చింది. ఈ కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్షతోపాటు లక్ష రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి జడ్జిమెంట్ ఇచ్చారు. ఈ తీర్పుతో గంజాయి రవాణా చేయాలన్నా, కొనాలనుకునేవారికి ఇక కటకటాలే గతి అనే విషయం స్పష్టం చేసినట్టు అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement