Thursday, April 18, 2024

Breaking: గుడ్ న్యూస్‌.. తెలంగాణ‌లో పండిన మొత్తం ధాన్యం మేమే కొంటాం: కేసీఆర్‌

తెలంగాణ రైతుల‌కు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. కేంద్రం ధాన్యం కొన‌కున్నా దిగులుప‌డాల్సిన ప‌నిలేద‌ని, రైతుల ప‌క్షాన తామున్నామ‌ని తెలియ‌జేశారు సీఎం కేసీఆర్‌. గ‌తంలో మీ బ్యాంకులో ఎట్ల‌యితే డ‌బ్బులు వ‌చ్చిన‌యో.. అట్ల‌నే ఇప్పుడు మీ ఖాతాలోకే డ‌బ్బులు వ‌స్త‌యి. ఎవ‌రిని న‌మ్ముకుని, ద‌ళారుల‌కు అమ్ముకోవ‌ద్దు. ఒక్క గింజ‌పోకుండా మొత్తం మేమే కొనుగోలు చేస్తాం. 1960 రూపాయ‌ల మ‌ద్ద‌తు ధ‌ర ఇస్తాం అని సీఎం కేసీఆర్ భ‌రోసా ఇచ్చారు. రేపటి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్​ చేయనున్నట్టు ప్రకటించారు కేసీఆర్​.

Advertisement

తాజా వార్తలు

Advertisement