Tuesday, April 30, 2024

భార‌త్ స‌రిహ‌ద్దుల్లో డ్రోన్ క‌ల‌క‌లం.. కాల్పులు జ‌రిపిన బీఎస్ఎఫ్ ద‌ళాలు

మ‌రోసారి పాకిస్థాన్ డ్రోన్ భార‌త స‌రిహ‌ద్దుల్లో క‌ల‌క‌లం రేపింది. దాంతో డ్రోన్ క‌ద‌లిక‌ల‌ను బీఎస్ ఎఫ్ సిబ్బంది గుర్తించారు. డ్రోన్ పై కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో చోటు చేసుకుంది. వెంటనే బీఎస్‌ఎఫ్ సిబ్బంది కాల్పులు జరపడంతో డ్రోన్ తిరిగి పాకిస్తాన్ వైపు వెళ్లిపోయింది. అయితే ఇందుకు సంబంధించి బీఎస్‌ఎఫ్ సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. బుధవారం రాత్రి గురుదాస్‌పూర్‌లోని అడియా సరిహద్దు ఔట్‌పోస్ట్ సమీపంలో డ్రోన్ కనిపించిందని ఒక అధికారి తెలిపారు. బీఎస్ఎఫ్ దళాలు పాకిస్థాన్ డ్రోన్‌పై 16 రౌండ్లు కాల్పులు జరిపాయని చెప్పారు. ఇల్యూమినేషన్ బాంబును కూడా ఉపయోగించాయని అధికారి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement