Friday, May 17, 2024

Breaking : ఆగివున్న రైలులో మంట‌లు – ప‌లువురు ప్ర‌యాణికుల‌కు గాయాలు

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. సహరాన్‌పూర్-ఢిల్లీ ప్యాసింజర్ రైలు దౌరాలా రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. రైలులోని 3 కోచ్‌ల నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ సమయంలో స్టేషన్ మొత్తం పొగతో నిండిపోయింది. రైలులో మంటలు చెలరేగాయన్న వార్త అక్కడ కలకలం సృష్టించింది. రైల్వే స్టేషన్ వద్ద తోపులాట జరిగింది ఇది చూసి రైలులోని ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. రైలు కోచ్‌ల నుంచి బయటకు వచ్చే క్రమంలో పలువురు ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. అయితే, మంటలు చెలరేగడంతో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రైలులో మంటలు రావడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో మంటలను అదుపు చేశారు. గాయపడిన ప్రయాణికులను అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు.
.

Advertisement

తాజా వార్తలు

Advertisement