Thursday, April 25, 2024

Breaking : రోడ్డు ప్ర‌మాదంలో సుశాంత్ కుటుంబానికి చెందిన..ఆరుగురు మృతి..న‌లుగురికి గాయాలు..

రోడ్డు ప్ర‌మాదంలో బాలీవుడ్ దివంగ‌త న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కుటుంబ‌స‌భ్యులు మ‌ర‌ణించారు..వివ‌రాల్లోకి వెళ్తే..హర్యానా కేడర్ ఐపీఎస్ అధికారి ఓం ప్రకాశ్ సింగ్… సుశాంత్ సింగ్ కు బంధువు అవుతారు. అయితే ఓం ప్రకాశ్ సింగ్ సోదరి మృతి చెందగా, బీహార్ లోని లఖిసరాయ్ లో ఆమె అంత్యక్రియలకు సుశాంత్ కుటుంబానికి చెందినవారు కూడా హాజరయ్యారు. వారు పాట్నా తిరిగివస్తుండగా లఖిసరాయ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వారు ప్రయాణిస్తున్న సుమో వాహనం ఓ ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో సుశాంత్ బావ, మేనల్లుడు, ఇతర బంధువులు ఉన్నారు. ఘటన జరిగిన సమయంలో సుమో వాహనంలో 10 మంది ఉన్నారు. ఆరుగురు మరణించగా, నలుగురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement