Saturday, April 27, 2024

Breaking : చీటింగ్ కేసులో శిల్పాశెట్టి..రాజ్ కుంద్రా..కేసు పెట్టిందెవ‌రో తెలుసా..

ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు బాలీవుడ్ దంపతులు..శిల్పాశెట్టి,రాజ్ కుంద్రాలు. పోర్న్ కేసులో బ‌యటికి వ‌చ్చి ఊపిరిపీల్చుకుంటోన్న స‌మ‌యంలో వీరు మ‌రో వివాదంలో చిక్కుకున్నారు. 1.51 కోట్ల చీటింగ్ కేసులో వీరిద్దరూ నిందితులుగా ఉన్నారన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ముంబై, బాంద్రా పోలీస్ స్టేషన్‌లో పూణె యువకుడు యష్ బరాయ్ ఈ జంట తనను మోసం చేశారంటూ కేసు నమోదు చేశారు. ఫ్యాషన్ టీవీ ఎండీ కషీఫ్ ఖాన్‌పై కూడా ఈ మేరకు పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది. ఈ ఘటన జూలై 2014లో జరిగినట్లు తెలుస్తోంది. ఫిట్‌నెస్ స్కీమ్‌లో డబ్బు పెట్టుబడి పెట్టమని కాషీఫ్ ఖాన్, శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాతో పాటు పలువురు తనను అడిగారని, భారీ లాభాలు వస్తాయని ఆశ చూపారని సదరు యువకుడు ఈ ఫిర్యాదులో ఆరోపించారు. కానీ అందులో తనకు ఎలాంటి లాభాలు రాకపోవడంతో తన డబ్బు 1.51 కోట్లు ఇచ్చేయాలంటూ అడగ్గా, యష్ ని బెదిరించారట. దీంతో చేసేది లేక యష్ బరాయ్ పోలీసులను ఆశ్రయించాడు. దాంతో మ‌రోసారి వీరి పేర్లు వార్త‌ల్లోకెక్కాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement