Friday, April 26, 2024

Breaking : ఉక్రెయిన్ రైల్వేస్టేష‌న్ పై – ర‌ష్యా రాకెట్ దాడి-30మంది మృతి – 100మందికి గాయాలు

ఉక్రెయిన్ పై ర‌ష్యా మ‌ళ్లీ బాంబుల వ‌ర్షం కురిపించింది. తూర్పు ఉక్రెయిన్ ను ర‌ష్యా టార్గెట్ చేసింది. రైల్వేస్టేష‌న్ పై రష్యా రాకెట్ దాడుల‌కి పాల్ప‌డింది. ఓ ప‌క్క భారీగా సైన్యాన్ని కొల్పోయామంటోన్న ర‌ష్యా త‌మ దాడుల‌ను మాత్రం ఆపట్లేదు.రెండు రష్యా క్షిపణులు ఈ రైల్వే స్టేషన్ ను తాకాయని 30 మందికి పైగా మరణించారని ఉక్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది. 100 మందికి పైగా గాయపడ్డారని వివరించింది. క్రామటోర్స్క్ రైల్వే స్టేషన్ ను సాధారణ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వినియోగిస్తున్నామని పేర్కొంది. రష్యా యుద్ధ నేరగాళ్లు తమ పౌరులను ఉద్దేశపూర్వకంగానే లక్ష్యంగా చేసుకుంటున్నారని, భారీస్థాయిలో విధ్వంసం సృష్టించే క్లస్టర్ బాంబులను కూడా ఉపయోగిస్తున్నారని ఆరోపించింది. ఈ దాడికి సంబంధించిన ఫొటోలను కూడా ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. రక్తపు మడుగుల్లో మృతదేహాలు పడివున్న తీరు భయానకంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement