Friday, May 17, 2024

Breaking : తెలంగాణ‌కు మేము వ్య‌తిరేకం కాదు – ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసింది – ప్ర‌ధాని మోడీ

రాజ్య‌స‌భ‌లో మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీని కాంగ్రెస్ హ‌డావిడిగా విభ‌జించింద‌న్నారు. తెలంగాణ‌కు మేము వ్య‌తిరేకం కాద‌న్నారు. ఉమ్మ‌డి ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసింద‌న్నారు మోడీ. విభ‌జ‌న చ‌ట్టంపై ఎలాంటి చ‌ర్చ జ‌ర‌ప‌లేద‌న్నారు. హ‌డావిడిగా విభ‌జ‌న బిల్లును ఆమోదించార‌ని ప్ర‌ధాని తెలిపారు. మైక్ లు క‌ట్ చేశారు, పెప్ప‌ర్ స్ప్రేలు కొట్టార‌న్నారు. వాజ్ పేయి 3రాష్ట్రాల‌ను శాంతియుతంగా ఏర్పాటు చేశార‌న్నారు. సొంత పార్టీ సీఎంల‌నూ కాంగ్రెస్ అవ‌మానించింద‌న్నారు మోడీ. ప్ర‌జాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఖూనీ చేసింద‌న్నారు. ఇదే నా ప్ర‌జాస్వామ్యం అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement