Thursday, May 2, 2024

Breaking : ప‌ట్టుద‌ల‌,పౌరుషానికి మారుపేరు తెలంగాణ‌-తెలుగులో మాట్లాడిన ప్ర‌ధాని మోడీ

హైద‌రాబాద్ చేరుకున్నారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. ఈ మేర‌కు ఆయ‌న బిజెపి కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో పాల్గొన్ని ప్ర‌సంగించారు. ఈ స‌భ బేగంపేట ఎయిర్ పోర్టులో జ‌రిగింది. కాగా తెలుగులో ప్ర‌సంగాన్ని ప్రారంభించారు మోడీ. ప‌ట్టుద‌ల‌,పౌరుషానికి మారు పేరైన తెలంగాణ ప్ర‌జ‌ల‌కు న‌మాస్కార‌మ‌ని తెలిపారు. ప్ర‌తి బిజెపి కార్య‌క‌ర్త ప‌టేల్ అడుగుజాడ‌ల్లో న‌డుస్తార‌న్నారు. దేశ ఐక్య‌మ‌త్య‌మే అత్యంత ప్ర‌ధాన‌మ‌ని మోడీ వెల్ల‌డించారు. భ‌ర‌త‌మాత సేవ మాకు అత్యంత ముఖ్య‌మ‌ని మోడీ చెప్పారు. ఈ స‌భ‌లో కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి,బండి సంజ‌య్, ఈటెల రాజేంద‌ర్ తో పాటు బిజెపి కార్య‌క‌ర్త‌లు భారీగా త‌ర‌లివ‌చ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement