Wednesday, April 24, 2024

జగదేవ్ పూర్ ఘోర రోడ్డుప్రమాదం : ఇద్ద‌రు మృతి, న‌లుగురికి తీవ్ర‌గాయాలు

ఓ ఆటోను లారీ ఢీకొన‌డంతో ఇద్ద‌రు మృతిచెంద‌గా, మ‌రో న‌లుగురికి తీవ్ర‌గాయాలైన ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా జ‌గ‌దేవ్పూర్ వ‌ద్ద చోటుచేసుకుంది. మండల కేంద్రమైన జగదేవ్పూర్ శివారులో జగదేవ్పూర్ నుండి గజ్వేల్ వెళుతున్న ప్యాసింజర్ ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఆటో డ్రైవర్ తో పాటు మరో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. రో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడటంతో వారిని 108 ఆంబులెన్స్ లో గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై జగదేవపూర్ ఎస్ఐ కృష్ణమూర్తి కేసు నమోదు చేసుకుని.. ప్రమాదానికి కారణమైన లారీని పోలీస్ స్టేషన్ కు తరలించి మృతదేహాలను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement