Tuesday, April 30, 2024

Breaking : భారీ అగ్ని ప్ర‌మాదం – ఇద్ద‌రు చిన్నారులు మృతి- మ‌హిళ‌కి గాయాలు

డొమెస్టిక్ సిలిండ‌ర్ పేలడంతో అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు చిన్నారు మృతి చెందారు..ఒక మ‌హిళ ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఈ సంఘ‌ట‌న బీహార్ రాష్ట్రంలోని దర్భంగా జిల్లా కుశేశ్వరస్థాన్‌లోని నారాయణపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ఘ‌ట‌న‌లో లక్షల రూపాయల ఆస్తి దగ్ధమైంది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్నారు. క్షతగాత్రులను సీహెచ్‌సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన పిల్లలు ఒకే కుటుంబానికి చెందినవారు. బాలికల్లో ఒకరి వయసు 10 ఏళ్లు కాగా, మరొకరి వయస్సు 8 ఏళ్లు ఉంటుందని తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement