Sunday, April 28, 2024

Breaking : సీఎం స్టాలిన్ కి రేష‌న్ బియ్యం మాఫియాపై – చంద్ర‌బాబునాయుడు లేఖ‌

త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ కు టిడిపి అధినేత చంద్ర‌బాబునాయుడు లేఖ రాశారు. రేష‌న్ బియ్యం మాఫియాపై ఈ మేర‌కు చంద్ర‌బాబు లేఖ రాశారు. త‌మిళ‌నాడు పీడీఎస్ బియ్యాన్ని ఏపీకి అక్ర‌మంగా త‌ర‌లిస్తున్నార‌ని ఆ లేఖ‌లో చంద్ర‌బాబు వివ‌రించారు. చిత్తూరు జిల్లా స‌రిహ‌ద్దులోని ఏడు మార్గాల ద్వారా పీడీఎస్ బియ్యంని త‌ర‌లిస్తున్నార‌న్నారు.ఇరు రాష్ట్రాల స‌రిహ‌ద్దుల్లో స‌రైన నిఘా లేద‌ని తెలిపారు. త‌మిళ‌నాడు బార్డ‌ర్ లో నిఘా పెంచాల‌ని లేఖ‌లో పేర్కొన్నారు చంద్ర‌బాబు.

Advertisement

తాజా వార్తలు

Advertisement