Monday, April 29, 2024

Breaking : విజ‌య‌వాడ ల‌యోల కాలేజీలో హిజాబ్ వివాదం

విజ‌య‌వాడ ల‌యోల కాలేజీలో హిజాబ్ వివాదం చెల‌రేగింది. హిజాబ్ వేసుకున్నందుకు కాలేజీ యాజ‌మాన్యం విద్యార్థుల‌ను రానివ్వ‌లేదు..ఐడీ కార్డు కూడా హిజాబ్ తోనే ఉంద‌ని తెలిపారు విద్యార్థినులు. కాలేజీ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళ‌న‌కి దిగాయి. దక్షిణాది రాష్ట్రం కర్ణాటకను కుదిపేస్తున్న ‘హిజాబ్‌ వస్త్రధారణ’ వివాదం తాజాగా విజయవాడలోనూ తలెత్తింది.
విజయవాడలోని లయోలా కాలేజీలో హిజాబ్‌ వేసుకొని వ‌స్తే కళాశాలకు రానివ్వట్లేదని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. ఐడీ కార్డులోనూ తాము హిజాబ్‌తోనే ఫొటో దిగామంటున్నారు. ఈ విషయం ముస్లిం మత పెద్దలతో పాటు తల్లిదండ్రులకు తెలియడంతో వారు కళాశాల వద్దకు చేరుకున్నారు. ఎప్పుడూ లేనిది ఇప్పుడెందుకు ఆపుతున్నారని తల్లిదండ్రులు ప్రశ్నించారు. దీనిపై కళాశాల ప్రిన్సిపాల్‌తో వారు మాట్లాడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement