Monday, April 29, 2024

Breaking : మాజీ ఎమ్మెల్యే కుమార్తె ఆత్మహత్య – సంతాపం తెలిపిన మంత్రి పువ్వాడ‌

ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె తాటి మహాలక్ష్మి(25) సారపాకలోని వారి స్వగృహంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నారు. మెడిసిన్ చదువు పూర్తి చేసిన మహాలక్ష్మి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదంగా మారింది.మహాలక్ష్మి మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం.. తాటి మహాలక్ష్మి మృతి పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. తాటి వెంకటేశ్వర్లు కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు. మహాలక్ష్మీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement