Saturday, May 18, 2024

Breaking : ప్ర‌ధాని మోడీ స‌భ‌కు జీహెచ్ ఎంసీ స‌హాయ నిరాక‌ర‌ణ‌- ఏర్పాట్లు చేస్తోన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ స‌భ‌కు జీహెచ్ ఎంసీ స‌హాయ నిరాక‌ర‌ణ తెలిపింది. ప‌రేడ్ గ్రౌండ్ లో విజ‌య సంక‌ల్ప స‌భ‌కు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. బిజెపి స‌భ‌కు క‌నీస ఏర్పాట్లు చేయ‌లేదు బ‌ల్దియా. కాగా బిజెపి స‌భ‌కు ఏర్పాట్లు చేస్తోంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు.బిజెపి నేత‌ల విన‌తుల‌ను తోసి పుచ్చింది జీహెచ్ ఎంసీ.కాగా ఈ స‌భ‌కు సాక్షాత్తు ప్ర‌ధాని మోడీ హాజ‌ర‌వుతున్నా జీహెచ్ ఎంసీ ప‌ట్టించుకోక‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు త‌లెత్తాయి.పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌..శానిటైజేష‌న్ తో పాటు మెయింట‌నెన్స్ బాధ్య‌త‌లు తీసుకుంది కంటోన్మెంట్. హెచ్ ఐసీసీ నుంచి హెలికాప్ట‌ర్ లో బేగంపేట‌కు చేరుకోకున్నారు మోడీ . బేగంపేట నుంచి రోడ్డుమార్గంలో ప‌రేడ్ గ్రౌండ్ కు చేరుకోనున్నారు మోడీ. ఈ స‌భ‌కు మోడీతో స‌హా 10మంది కీల‌క‌నేత‌లు హాజ‌రుకానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement