Thursday, May 9, 2024

Breaking : తండ్రి చేసిన అప్పు తీర్చ‌లేద‌ని న‌టి ‘శిల్పాశెట్టి’కి కోర్టు నోటీసులు

మ‌రోవివాదంలో చిక్కుకుంది బాలీవుడ్ న‌టి శిల్పాశెట్టి. ఫిబ్ర‌వ‌రి 28న కోర్టులో హాజ‌రుకావాలంటూ నోటీసులు పంపారు. రూ.21ల‌క్ష‌ల అప్పు చెల్లించ‌లేదంటూ ఓ వ్యాపారి శిల్పాశెట్టి, త‌ల్లి సునందా శెట్టి, సోద‌రి ష‌మితా శెట్టిపై ఫిర్యాదు చేశాడు. శిల్పాశెట్టి తండ్రి చేసిన అప్పును తీర్చేందుకు నిరాక‌రించార‌ని ముంబై వ్యాపారి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. 2015లో రూ.21ల‌క్ష‌ల రుణం తీసుకున్నార‌ట‌ శిల్పాశెట్టి తండ్రి. ఈ మేర‌కు అంథేరీ కోర్టు శిల్పాతో పాటు ఆమె త‌ల్లి, సోద‌రికి కూడా నోటీసులు అందించింది. కాగా ఫిబ్ర‌వ‌రి 28న కోర్టులో హాజ‌రుకావాల‌ని స‌మ‌న్లు జారీ చేసింది. ఈ మ‌ధ్య‌కాలంలో శిల్పాశెట్టి త‌ర‌చూ వివాదాల్లో నిలుస్తోన్న సంగ‌తి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement