Saturday, May 4, 2024

Breaking : జాక్వెలిన్ ని వ‌ద‌ల‌ని ఈడీ – ఆస్తులు అటాచ్

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టించిన సాహో చిత్రంలో ఓ సాంగ్ లో ఆడిపాడింది బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాడైజ్. కాగా ఈమె ఓ వివాదంలో చిక్కుకుంది. దాంతో ఆమె ఆస్తుల‌ను ఈడీ అటాచ్ చేసింది. ఇటీవల ఆమెను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఓ కేసు విషయంలో సుదీర్ఘ సమయం విచారించింది. రూ. 200 కోట్ల స్కామ్ లో సూత్రధారి అయిన సుకేశ్‌ చంద్రశేఖర్ ఇప్పటికే అరెస్ట్ అయ్యి ఊచలు లెక్కపెడుతున్నారు. అతనితో సాన్నిహిత్యం ఉన్న శ్రీలంకకు చెందిన హీరోయిన్ జాక్విలిన్ ను ఈడీ అధికారులు పలు మార్లు ప్రశ్నించారు. తాజాగా ఆస్తులను అటాచ్ చేశారు. సుకేశ్‌ నుండి జాక్విలిన్ రూ. 5.71 కోట్ల విలువచేసే బహుమతులను తీసుకుందని ఈడీ విచారణలో తేలింది. మూడు డిజైనర్ బ్యాగ్స్, మల్టిపుల్ డైమండ్ జ్యూయలరీ సెట్, రెండు బ్రాస్లెట్స్, రూ. 52 లక్షల విలువ చేసే ఓ గుర్రాన్ని సుకేశ్ ఆమెకు గిఫ్ట్ గా ఇచ్చారు. అయితే… సన్ టీవీ అధినేతగా తనకు సురేశ్ పరిచయమని, తన బంధువులకు అతను భారీ మొత్తంలో బహుమతులు ఇచ్చార‌ని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement